Telangana: వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-11-15T13:26:20+05:30 IST

వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంది.

Telangana: వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం రెండో  సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంది. వేకువజాము నుండే  స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్‌లలో వేచి ఉన్నారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని స్వామి వారికి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అలాగే అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Updated Date - 2021-11-15T13:26:20+05:30 IST