రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-10-19T05:45:10+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు

వేములవాడ, అక్టోబరు 18 :  వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు  తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు.  స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, అమ్మవారి కుంకుమపూజల్లో పాల్గొన్నారు. ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. సోమవారం సందర్భంగా గర్భాలయ ప్రవేశం రద్దు చేసి లఘుదర్శనం అమలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. బోనం మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.  

Updated Date - 2021-10-19T05:45:10+05:30 IST