రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-05-17T05:57:08+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో రద్దీగామారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.

రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు

వేములవాడ, మే 16: వేములవాడ  రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో రద్దీగామారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు  స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఆలయ కల్యాణకట్ట తలనీలాలు సమర్పించే భక్తులతో రద్దీగా మారింది. క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు కిక్కిరిసిపోయాయి. పలువురు భక్తులు  స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. సోమవారం సందర్భంగా గర్భాలయ ప్రవేశం నిలిపివేసి లఘుదర్శనం అమలు చేశారు. దీంతో భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయం, భీమేశ్వరాలయం భక్తులతో రద్దీగా మారాయి. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.   భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2022-05-17T05:57:08+05:30 IST