అశ్వ వాహనంపై స్వామివారల విహారం

ABN , First Publish Date - 2021-04-17T05:12:34+05:30 IST

శ్రీరామనవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో లక్ష్మీఅనంత పద్మనాభస్వామి, పార్వతీ రాజరాజేశ్వరస్వామివారలు శుక్రవారం అశ్వ వాహనంపై విహరించారు.

అశ్వ వాహనంపై స్వామివారల విహారం
అశ్వ వాహనంపై విహరిస్తున్న స్వామివారలు

 వేములవాడ, ఏప్రిల్‌ 16 : శ్రీరామనవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో  లక్ష్మీఅనంత పద్మనాభస్వామి, పార్వతీ రాజరాజేశ్వరస్వామివారలు శుక్రవారం అశ్వ వాహనంపై విహరించారు. శ్రీరామనవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగో  రోజు ఆలయ అర్చకులు, వేదపండితులు ఉదయం  రాజరాజేశ్వరస్వామివారికి  మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,  సీతారామచంద్రస్వామివారికి ఉపనిషత్‌ ద్వారా అభిషేకం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరివార, అనుబంధ దేవతలకు అభిషేకములు తదుపరి సదస్యము నిర్వహించారు. రాత్రి  లక్ష్మీ అనంత పద్మనాభస్వామి,  పార్వతీ రాజరాజేశ్వరస్వామివారల ఉత్సవ విగ్రహాలను అశ్వ వాహనంపై ఆలయ ఆవరణలో ఊరేగించారు. ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T05:12:34+05:30 IST