Vemulawada రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2021-12-13T12:39:01+05:30 IST
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని తరించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన
రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని తరించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణ వ్రతం తదితర ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. దేవస్థానానికి అనుబంధంగా ఉన్న బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. బోనం మొక్కు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.