Vemulawadaలో ఆషాఢం ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2022-07-09T00:17:32+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడపై ఆషాఢ మాసం ఎఫెక్ట్‌ పడింది. ఆషాఢమాసం ప్రారంభంతో

Vemulawadaలో ఆషాఢం ఎఫెక్ట్‌

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడపై ఆషాఢ మాసం ఎఫెక్ట్‌ పడింది. ఆషాఢమాసం ప్రారంభంతో గత నెల 30వ తేదీ నుంచి రాజరాజేశ్వరస్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆషాఢమాసంలో తీర్థయాత్రలు, దైవ దర్శనాలకు వెళ్లడాన్ని చాలా మంది ఇష్టపడరు. ఫలితంగా  పది రోజులుగా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో క్యూలైన్లు దాదాపు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా మొక్కులు ఉన్నవారు మాత్రమే  స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. కొవిడ్‌ ఎఫెక్ట్‌ తగ్గిత తరువాత మహాశివరాత్రి పర్వదినానికి ముందు నుంచి రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం నిత్యం వేలాది మంది యాత్రికులతో సందడిగా మారింది. అప్పటి నుంచి వరుసగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆషాఢం మాసం ప్రారంభంతో భక్తుల రాక తగ్గిపోయింది. భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో రద్దీ నియంత్రణకు, భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడానికి కష్టపడి పనిచేసిన ఆలయ ఉద్యోగులు ఆషాఢం ఎఫెక్ట్‌తో కొంత మేరకు సేదతీరుతున్నారు. కాగా, శ్రావణమాసంలో మళ్లీ భక్తుల సంఖ్య భారీగా పెరుగనుంది. శ్రావణమాసంలో అన్నీ మంచి రోజులు కావడం, పండుగలు, శుభకార్యాలు, ఆలయ ఉత్సవాలు, ప్రత్యేక పూజల కారణంగా తిరిగి భక్తుల రద్దీ పెరుగనుంది.

Updated Date - 2022-07-09T00:17:32+05:30 IST