గ్రీన్జోన్గా వేంపల్లి - ఆంక్షలు తొలగింపు
ABN , First Publish Date - 2020-05-16T10:55:28+05:30 IST
కంటైన్మెంట్ జోన్ ఆంక్షలతో ఉన్న వేంపల్ల్లిను గ్రీన్జోన్గా మారుస్తున్నట్లు కలెక్టర్ హరికిరణ్ ప్రకటించా రు.
కలెక్టర్ హరికిరణ్
కడప(కలెక్టరేట్) మే 15: కంటైన్మెంట్ జోన్ ఆంక్షలతో ఉన్న వేంపల్ల్లిను గ్రీన్జోన్గా మారుస్తున్నట్లు కలెక్టర్ హరికిరణ్ ప్రకటించా రు. శుక్రవారం నుంచి ఆంక్షలు తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. వేంపల్లిలో రెండు పాజిటివ్ కేసులు నమోదుతో కంటైన్మెంట్ జోన్లో ఉం డాల్సిన ఆంక్షలను అమలు చేశామన్నారు.
ఏప్రిల్ 1 నాటికి చివరిగా కేసు నమోదు కావ డం, చివరి కేసు కూడా అదే నెల 16న నెగిటివ్రిపోర్టు రావడంతో డిశ్చార్జ్ చేశామన్నారు. అప్పటి నుంచి 28 రోజుల పాటు ఎలాంటి కేసులు నమోదు కానందున వేపల్లి పంచాయితీలో కంటైన్మెంట్ జోన్ ఆంక్షలు ఎత్తి వేస్తూ గ్రీన్ జోన్గా ప్రకటించారు.