సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై మంత్రి సీరియస్
ABN , First Publish Date - 2020-05-29T00:33:19+05:30 IST
సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు.
అమరావతి: సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. ఆంధ్రాలో ప్రార్ధనా స్థలాలకు వసూలు చేస్తున్న కరెంట్ బిల్లుపై కూడా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం '40 ఇయర్స్ ఇండస్ట్రీ'కే చెల్లిందన్నారు. కులాలు, మతాలు మధ్య మధ్య చిచ్చు పెడుతూ ఇంకెన్ని రోజులు రాజకీయం చేస్తారు? అని ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాంపై సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్కు మంత్రి ఆదేశించారు.