Church Anniversary: 29 నుంచి వేలాంకన్ని చర్చి వార్షికోత్సవం
ABN , First Publish Date - 2022-08-03T16:58:36+05:30 IST
నాగపట్నం జిల్లాలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వేలాంకన్ని మేరీమాత ఆలయ వార్షికోత్సవం(Anniversary) ఈ నెల 29న పతాకావిష్కరణతో ప్రారంభం కానుంది. ఈ
ప్యారీస్(చెన్నై), ఆగస్టు 2: నాగపట్నం జిల్లాలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వేలాంకన్ని మేరీమాత ఆలయ వార్షికోత్సవం(Anniversary) ఈ నెల 29న పతాకావిష్కరణతో ప్రారంభం కానుంది. ఈ ఏర్పాట్లపై మంగళవారం ఉదయం వేలాంకన్ని చర్చి ప్రాంగణంలోని ఆరోగ్యమాత(healthy mother) కల్యాణమండపంలో జిల్లా కలెక్టర్ అరుణ్ తంబురాజ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధాన నిర్వాహకులు, ఆరోగ్య, అగ్నిమాపక, పోలీసు, రవాణా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం కలెక్టర్(Collector) మీడియాతో మాట్లాడుతూ.. వేలాంకన్ని చర్చి ఉత్సవం ఈ నెల 29 నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. ఉత్సవం రోజుల్లో భక్తుల రద్దీని నియంత్రించేందుకు, ముఖ్యంగా పొరుగు ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 24 గంటలూ బస్సులు నడపనున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు వాచ్టవర్ల పైనుంచి పర్యవేక్షిస్తారన్నారు. ముఖ్యంగా సముద్ర స్నానాలను నిషేధించమన్నారు.