కూరగాయలకు కేటాయించిన కేంద్రాల దగ్గరే కొనాలి
ABN , First Publish Date - 2020-03-28T11:54:04+05:30 IST
లాక్డౌన్ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో కూరగాయల విక్రయ కేంద్రాలను అనువైన ప్రదేశాల్లో ప్రభుత్వం ఏర్పాటు
సీఐ సూర్యనాయక్
వనపర్తి క్రైమ్, మార్చి 27: లాక్డౌన్ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో కూరగాయల విక్రయ కేంద్రాలను అనువైన ప్రదేశాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని సీఐ సూర్యనాయక్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానం, గాంధీ చౌక్ సమీపంలో, బస్డిపో దగ్గర మార్కెట్ యార్డు స్థలంలో ఏర్పాటు చేసిన కూరగాయల కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.
ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎవరికి అవసరమైన కూరగాయలు వారు కొనుగోలు చేసుకోవాలని సీఐ కోరారు. పోలీసులు సూచించిన సమయాల్లోనే ఇంటికి ఒకరు మాత్రమే వచ్చి జాగ్రత్తలు పాటిస్తూ కొనుగోలు చేయాలని తెలిపారు. ఆయన వెంట ఎస్ఐ వెంకటేష్గౌడ్, పోలీసు సిబ్బంది ఉన్నారు.