Perambur: మునక్కాయలు కిలో రూ.300
ABN , First Publish Date - 2021-12-08T16:50:22+05:30 IST
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి. మునక్కాయలు కిలో రూ.300 పలుకుతుండగా, వంకాయలు, టమోటా
హడలెత్తిస్తున్న కూరగాయల ధరలు
చెన్నై/పెరంబూర్: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి. మునక్కాయలు కిలో రూ.300 పలుకుతుండగా, వంకాయలు, టమోటా ధరలు రూ.100 దాటడంతో ప్రజలు హడలిపోతున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా దిగుమతులు తగ్గడంతో టమోటా, వంకాయలు కిలో రూ.100 నుంచి రూ.110, మునక్కాయలు కిలో రూ.300 నుంచి రూ.330కి విక్రయమవు తుండగా, మిగిలిన కూరగాయల ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి.