వీరబ్రహ్మేంద్ర హుండీ ఆదాయం రూ.32.28 లక్షలు

ABN , First Publish Date - 2021-12-03T04:55:36+05:30 IST

వీరబ్రహ్మేంద్రస్వామిఆలయ హుండీ ఆదాయం రూ.32,28,145 వచ్చినట్లు దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, ఫిట్‌పర్సన్‌ శంకర్‌ బాలాజీ తెలిపారు.

వీరబ్రహ్మేంద్ర హుండీ ఆదాయం రూ.32.28 లక్షలు
ఆలయంలో హుండీని లెక్కిస్తున్న భక్తులు

బ్రహ్మంగారిమఠం, డిసెంబరు 2:  వీరబ్రహ్మేంద్రస్వామిఆలయ హుండీ ఆదాయం రూ.32,28,145 వచ్చినట్లు దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, ఫిట్‌పర్సన్‌ శంకర్‌ బాలాజీ తెలిపారు. భక్తులుస్వామివారిని దర్శించుకుని సమర్పించిన కానుకలను ఎనిమిది నెలలకు సంబంధించి ఆరు చిన్న హుండీలను లెక్కించగా రూ.32,28,145 నగదు, 121 గ్రాముల బంగారం, 1200 గ్రాముల వెండి వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో మఠం మేనేజర్‌ ఎన్‌.ఈశ్వరయ్య ఆచారి, దేవదాయ శాఖ సిబ్బంది రవికిరణ్‌, శివయ్య, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

 

Updated Date - 2021-12-03T04:55:36+05:30 IST