అంతర్జాతీయ వెటరన్‌ క్రీడాకారుడు వీరభద్రరరావు మృతి

ABN , First Publish Date - 2021-03-01T05:43:30+05:30 IST

అంతర్జాతీయ వెటరన్‌ టేబుల్‌టెన్నిస్‌ క్రీడాకారుడు జీవీఎస్‌ వీరభధ్రరరావు(75) గుంటూరులో ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు.

అంతర్జాతీయ వెటరన్‌ క్రీడాకారుడు వీరభద్రరరావు మృతి
వీరభధ్రరరావు(ఫైల్‌ ఫొటో)

గుంటూరు(క్రీడలు), ఫిబ్రవరి28: అంతర్జాతీయ వెటరన్‌ టేబుల్‌టెన్నిస్‌ క్రీడాకారుడు జీవీఎస్‌ వీరభధ్రరరావు(75) గుంటూరులో ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించి జిల్లా కీర్తిప్రతిష్టలను దేశం నలుమూలల వ్యాపింపచేశారు. ఆయన జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ సంఘ కార్యదర్శిగా, బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగిగా విధులు నిర్వహించేవారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో క్రీడాకారులుకు  శిక్షణ ఇచ్చేవారు. వీరభద్రరరావు మృతిపై జిల్లా టేబుల్‌టెన్నిస్‌ సంఘ సభ్యులు, పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.

Updated Date - 2021-03-01T05:43:30+05:30 IST