టీఆర్ఎస్కు షాకిచ్చి ఈటల వర్గంలో చేరిన కీలక నేత
ABN , First Publish Date - 2021-05-18T17:39:08+05:30 IST
మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత జిల్లాలో రాజకీయ పావులు చకచకా కదులుతున్నాయి. ఈటల తన వర్గాన్ని బలపరుచుకునేందుకు ప్రయత్నిస్తుంటే...
కరీంనగర్: మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత జిల్లాలో రాజకీయ పావులు చకచకా కదులుతున్నాయి. ఈటల తన వర్గాన్ని బలపరుచుకునేందుకు ప్రయత్నిస్తుంటే... నేతలు చేజారకుండా టీఆర్ఎస్ జాగ్రత్త పడుతోంది. అయితే ఇవాళ జిల్లాలో టీఆర్ఎస్కు షాక్ తగిలింది. హుజురాబాద్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటలను వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుక- తిరుపతి రెడ్డి కలిశారు. ఇటీవల మంత్రి గంగులను కలిసి మద్దతు తెలిపిన ఆమె.. రెండు రోజులకే ఈటల గూటికి చేరడం స్థానంకగా సంచలనం సృష్టిస్తోంది. స్కూల్ విషయంలో భయ పడొద్దు అని, అండగా ఉంటానని ఈటల హామీ ఇచ్చినట్టు సమాచారం.