మే 19 నుంచి వేదగిరి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-04-17T04:52:03+05:30 IST

జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు మే 19వ తేదీ నుంచి జరపాలని ఆలయ అర్చక బృందం నిర్ణయించింది.

మే 19 నుంచి వేదగిరి బ్రహ్మోత్సవాలు

నెల్లూరు రూరల్‌, ఏప్రిల్‌ 16 : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు మే 19వ తేదీ నుంచి జరపాలని ఆలయ అర్చక బృందం నిర్ణయించింది. మే 19న అంకురోపణ, 23వ తేదీన హనుమంత సేవ, 24న బంగారు గరుడసేవ, 25న కల్యాణోత్సవం, 26వ తేదీన రఽథోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. అయితే  కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపఽథ్యంలో ప్రభుత్వాల నుంచి రోజుకో రకంగా ఆదేశాలు వెలువడుతున్నా యి. ఈ క్రమంలో నృసింహుడి ఉత్సవాల నిర్వహణపైనా అనుమానాలు నెలకొన్నాయి. గతేడాది లాక్‌డౌన్‌ కారణంగా ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-04-17T04:52:03+05:30 IST