వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం
ABN , First Publish Date - 2022-05-18T06:04:38+05:30 IST
వేదాద్రి యోగానంద లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం అనంతరం స్వామికి సోమవారం రాత్రి కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించారు.
జగ్గయ్యపేట రూరల్, మే 17 : వేదాద్రి యోగానంద లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం అనంతరం స్వామికి సోమవారం రాత్రి కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించారు. కన్నుల పండువగా అలంకరించిన హంస వాహనంపై స్వామిని ఉంచారు. వంశపారంపర్య ధర్మకర్త డాక్టర్ వెలగపూడి లక్ష్మణ ఇందిరాదత్ తరపున కేసీపీ ఉద్యోగులు, ఈవో సురేష్బాబు, భక్తులు పాల్గొన్నారు.