వీఈసీవీ చేతికి వోల్వో బస్ వ్యాపారం
ABN , First Publish Date - 2020-08-14T07:46:02+05:30 IST
భారత్లో వోల్వో గ్రూప్ బస్ వ్యాపారాన్ని రూ.100.5 కోట్లకు అనుబంధ సంస్థ వీఈసీవీ కొనుగోలు చేయనుందని ఐషర్ మోటార్స్ వెల్లడించింది. ఈ మేరకు వీఈసీవీ, ఐషర్ మోటార్స్లో వోల్వో బస్ ఇండియా (వీబీఐ) వ్యాపారాన్ని...
న్యూఢిల్లీ: భారత్లో వోల్వో గ్రూప్ బస్ వ్యాపారాన్ని రూ.100.5 కోట్లకు అనుబంధ సంస్థ వీఈసీవీ కొనుగోలు చేయనుందని ఐషర్ మోటార్స్ వెల్లడించింది. ఈ మేరకు వీఈసీవీ, ఐషర్ మోటార్స్లో వోల్వో బస్ ఇండియా (వీబీఐ) వ్యాపారాన్ని విలీనం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. డీల్లో భాగంగా ఐషర్, వోల్వో బ్రాండెడ్ ఉత్పత్తుల నుంచి వీఈసీవీ విడిపోయి విడిగా బస్ డివిజన్ను నిర్వహించనుంది. ఈ బస్ డివిజన్ భారత్లో వోల్వో, ఐషర్ బస్సు ల తయారీ, పంపిణీ, విక్రయాన్ని చేపట్టనుంది.