పశువైద్య వర్సిటీ వీసీగా డాక్టర్ వంగూర్ బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2021-01-19T07:13:48+05:30 IST
పీవీ నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్గా డాక్టర్ వంగూర్ రవీందర్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
రాజేంద్రనగర్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): పీవీ నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్గా డాక్టర్ వంగూర్ రవీందర్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత తొలిసారిగా వర్సిటీకి పూర్తిస్థాయి వీసీ నియమితులయ్యారు. డాక్టర్ వంగూర్ రవీందర్రెడ్డి గతంలో కోరుట్ల పశువైద్య కళాశాల ప్రిన్సిపాల్గా, పశువైద్య విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ ఫ్యాకల్టీగానూ, రిజిస్ట్రార్గాను పని చేశారు. 2018లో ఉద్యోగ విరమణ చేశారు. వీసీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మాట్లాడుతూ పశువైద్య, మత్స్యశాస్త్ర, డైరీ టెక్నాలజీ విబాగాలలో ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తానన్నారు.