విశాఖ షిప్ యార్డు ప్రమాద బాధిత కుటుంబాలకు వాసుపల్లి పరామర్శ
ABN , First Publish Date - 2020-08-02T22:46:54+05:30 IST
విశాఖ షిప్ యార్డు ప్రమాద బాధిత కుటుంబాలకు వాసుపల్లి పరామర్శ
విశాఖపట్నం: కేజీహెచ్ లో షిప్ యార్డు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులను విశాఖ టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను వాసుపల్లి ఓదార్చారు. ప్రభుత్వం ద్వారా తగిన ప్రోత్సాహకం అందేలా చూస్తానని బాధిత కుటుంబాలకు వాసుపల్లి గణేష్ కుమార్ హామీ ఇచ్చారు.కేజీహెచ్ సిబ్బందితో మాట్లాడి వెంటనే పోస్టు మార్టం జరిగేలా చూస్తానని వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పారు.