14 నెలలు మనుసు చంపుకొని టీడీపీలో పని చేశా: వాసుపల్లి

ABN , First Publish Date - 2020-09-23T20:33:22+05:30 IST

విశాఖపట్నం: డైనమిక్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన చేస్తున్నారని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు.

14 నెలలు మనుసు చంపుకొని టీడీపీలో పని చేశా: వాసుపల్లి

విశాఖపట్నం: డైనమిక్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన చేస్తున్నారని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేని పనులు జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్నాయి. 14 నెలలు మనుసు చంపుకొని టీడీపీలో పని చేశానన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి పని లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశారన్నారు. పరిపాలనా రాజధాని ప్రకటించిన రోజే తాను స్వాగతించానన్నారు. కొంతమంది రాక్షసుల్లా పరిపాలన రాజధానిని అడ్డుకుంటున్నారన్నారు. తాను పార్టీ ద్రోహిని అయితే చంద్రబాబు పేదల ద్రోహి.. .టీడీపీలో వాసుపల్లికి గౌరవం ఉందన్నారు. టీడీపీపై ప్రజలకు గౌరవం లేకపోవడంతో పార్టీ మారానన్నారు. తనకు ఎవరి మీద శత్రుతత్వం లేదన్నారు. విధాన పరంగా మాత్రమే విభేదాలు ఉంటాయని తెలిపారు.

Updated Date - 2020-09-23T20:33:22+05:30 IST