పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వాసుపత్రి ఘటన జరిగింది : వాసిరెడ్డి పద్మ
ABN , First Publish Date - 2022-04-23T19:55:29+05:30 IST
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటాతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ భేటీ అయ్యారు.
విజయవాడ : విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటాతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ భేటీ అయ్యారు. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ ఘటనపై చర్చించారు. అనంతరం వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ.. కేసు దర్యాప్తుపై కమిషనర్తో చర్చించామన్నారు. పోలీసుల నిర్లక్యం వల్లే ఘటన జరిగిందన్నారు. అందుకే సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేశామని పద్మ వెల్లడించారు. త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని సీపీ చెప్పారన్నారు. ఇకపై మిస్సింగ్ కేసులపై వేగంగా స్పందించాలని సీపీకి సూచించినట్టు వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత బోండా ఉమలకు డైరెక్ట్గా తమ సిబ్బందే నోటీసులు ఇచ్చారన్నారు. విచారణకు రాకపోతే ఎలా రప్పించాలో కమిషన్కి తెలుసని వాసిరెడ్డి పద్మ తెలిపారు.