ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నిర్మిస్తోన్న ట్రైలింగ్వల్ మూవీ 'వసంత కోకిల'. జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణ సారధ్యంలో నూతన దర్శకుడు రమణన్ పురుషోత్తమ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ సింహాకి జోడిగా '@నర్తనశాల' ఫేమ్ కాశ్మీర పర్ధేశీ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేయగా మంచి స్పందనను రాబట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ను రేజ్ ఆఫ్ రుద్ర పేరిట విడుదల చేశారు.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్, బాబీ సింహా మ్యాన్లీ లుక్.. అన్నీ హైలెట్గా ఉన్న ఈ రైజ్ ఆఫ్ రుద్ర మోషన్ పోస్టర్.. సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది. సౌత్ ఇండియాలోనే తొలిసారిగా ఈ మోషన్ పోస్టర్కు వీడియో గ్లిమ్స్ కూడా జోడించి సిద్ధం చేశారు. రొమాంటిక్ థ్రిల్లర్ జానర్గా ఈ సినిమా రెడీ అవుతుంది. సినిమా జానర్కి, బాబీ సింహా అత్యుత్తమ పర్ఫార్మెన్స్ కి తగిన విధంగానే దర్శకుడు రమణన్ వసంత కోకిలను తెరకెక్కించామని చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా చెబుతోంది. జాతీయ అవార్డు గ్రహిత, విలక్షణ హీరో కమలహాసన్, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన వసంత కోకిల ఏ రేంజ్ సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో మరో జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా నటించడం విశేషం. థింక్ మ్యూజిక్ వారు ఈ సినిమా ఆడియో రైట్స్ దక్కించుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా విడుదల చేస్తామని నిర్మాత రామ్ తాళ్లూరి తెలిపారు.