AP News: వరుపుల రాజా ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు

ABN , First Publish Date - 2022-07-22T23:46:28+05:30 IST

టీడీపీ నేత వరుపుల రాజా (Varupula Raja) ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ప్రత్తిపాడులోని రాజా ఇంటికి పోలీసులు వచ్చారు.

AP News: వరుపుల రాజా ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు

కాకినాడ: టీడీపీ నేత వరుపుల రాజా (Varupula Raja) ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ప్రత్తిపాడులోని రాజా ఇంటికి పోలీసులు వచ్చారు. గతంలో లంపకలోవ సోసైటీ అవకతవకలపై సీఐడీ కేసు రాజాపై కేసు నమోదు చేసింది. అయితే ఆయనకు హైకోర్టు (High Court) బెయిల్‌ మంజూరు చేసింది. అయినా అరెస్ట్ చేసేందుకే పోలీసులు వచ్చారని టీడీపీ నేతలు (TDP leaders) చెబుతున్నారు. పోలీసులు వచ్చారన్న విషయం తెలియడంతో వరుపుల రాజా నివాసానికి టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. రెండు రోజుల కిందట టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి‌రామ్‌(TDP National Spokesperson Kommareddy Pattabhiram) ఇంటికి విజయవాడ వన్‌టౌన్ పీఎస్‌‌ పోలీస్‌ అధికారులు వెళ్లారు. 41 ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు యత్నించారు. అయితే మీడియా ప్రతినిధులను చూసి నోటీసులు ఇవ్వకుండానే వెనుతిరిగారు. ఈ ఘటనపై స్పందించిన పట్టాభిరామ్ వన్‌ టౌన్‌ పోలీసులు తనకు 41 ఏ కింద నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు. తాను ఇంటి వద్దే ఉన్నానని, నోటీసులు ఇవ్వొచ్చని ఆయన సూచించారు. తనపై ఇప్పటికే చాలాసార్లు భౌతికదాడులు జరిగాయని.. మీడియా ఉంటే నోటీసులు ఇవ్వడానికి ఎందుకు జంకుతున్నారని పట్టాభి ప్రశ్నించారు. 

Updated Date - 2022-07-22T23:46:28+05:30 IST