కన్నబాబు వ్యవసాయ శాఖను గాలికి వదిలేశారు: ఎస్‌వీఎస్ఎన్ వర్మ

ABN , First Publish Date - 2022-03-11T18:05:09+05:30 IST

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆ శాఖను గాలికి వదిలేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌వీఎస్ఎన్ వర్మ విమర్శించారు.

కన్నబాబు వ్యవసాయ శాఖను గాలికి వదిలేశారు: ఎస్‌వీఎస్ఎన్ వర్మ

కాకినాడ : వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆ శాఖను గాలికి వదిలేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌వీఎస్ఎన్ వర్మ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి రైతులు తామర తెగులతో తీవ్రంగా నష్టపోయారన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు నష్ట పోతే విత్తనాలు అమ్మిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని వర్మ ప్రశ్నించారు. విత్తనాలు అమ్మినవారు వైసీపీ నేతలు కావడంతోనే వదిలేశారన్నారు. ఏలేరు ఆధునికీకరణకు టీడీపీ టైంలో శంకుస్థాపన చేశామని.. దానిని వైసీపీ అధికారంలోకి వచ్చాక నిలిపివేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. కనీసం పురుషోత్తపట్నం ఎత్తి పోతల పథకం ద్వారా కూడా నీళ్లు అందించలేకపోయారని వర్మ విమర్శించారు.

Updated Date - 2022-03-11T18:05:09+05:30 IST