కేసు దర్యాప్తుకు కొన్ని పెద్ద శక్తులు అడ్దుపడుతున్నాయి: వర్ల
ABN , First Publish Date - 2022-03-13T01:42:03+05:30 IST
కేసు దర్యాప్తుకు కొన్ని పెద్ద శక్తులు అడ్దుపడుతున్నాయి: వర్ల
అమరావతి: వివేకాహత్య కేసులో సీబీఐ దర్యాప్తు అంచెలంచెలుగా సాగుతున్నదని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. ఈ కేసు దర్యాప్తుకు కొన్ని పెద్ద శక్తులు అడ్దుపడుతున్నాయని అందరూ అనుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంతఃపుర రహస్యాన్ని ఛేదించడ, సీబీఐకి పెద్ద పనేమీ కాదన్నారు. అయితే, సీబీఐ కున్న అడ్దంకులు తొలగిపోతే, వాస్తవాలన్నీ చకచకా బయటకు వస్తాయన్నారు.