నాటుసారాపై దాడులకు బ్రేకు ఎందుకు? : వర్ల రామయ్య
ABN , First Publish Date - 2022-03-19T20:41:38+05:30 IST
వైసీపీ సర్కారు, సీఎం జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేత వర్లరామయ్య ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
అమరావతి: వైసీపీ సర్కారు, సీఎం జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేత వర్లరామయ్య ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.‘‘రాష్త్రవ్యాప్తంగా నాటుసారా ఏరులై పారుతూ, ఎందరో వ్యసనపరుల ప్రాణాలు తీస్తుంటే, సీఎం జగన్మోహన్రెడ్డి నాటుసారా మరణాలన్నీ సహజ మరణాలని సెలవిస్తారా..?. జంగారెడ్దిగూడెoలోనే ఎందరో నాటుసారా విక్రయదారులు, కాపు దారులు అర్రెస్ట్ అయ్యారు ఈ విషయం వైసీపీ ప్రభుత్వానికి తెలియదా?. ఆ తర్వాత రాష్త్రవ్యాప్తంగా నాటుసారాపై దాడులకు బ్రేకు ఎందుకు పడింది సార్?’’ అని ట్విట్టర్ వేదికగా సీఎం జగన్మోహన్రెడ్డి తీరుని వర్ల రామయ్య ప్రశ్నించారు.