జగన్ పాలనలో దళితులకు రక్షణ లేదు: వర్ల

ABN , First Publish Date - 2020-08-06T01:35:22+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. జగన్ అధికారం చేపట్టిన నాటి నుండి దళితులను టార్గెట్ చేసి యధేచ్చగా దాడులు చేస్తున్నారని

జగన్ పాలనలో దళితులకు రక్షణ లేదు: వర్ల

అమరావతి: వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. జగన్ అధికారం చేపట్టిన నాటి నుండి దళితులను టార్గెట్ చేసి యధేచ్చగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. దళిత యువకుడిని ఎగిరి తన్నిన పోలీస్ అధికారిని ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద అరెస్ట్ చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. అలాగే సీతానగరంలో యువకుడికి శిరోముండనం చేయించిన ముద్దాయిని అరెస్ట్ చేయరా? అని ప్రశ్నించారు.

Updated Date - 2020-08-06T01:35:22+05:30 IST