కొందరు పోలీసులు వైసీపీ నేతలతో కుమ్మక్కయ్యారని ఎన్హెచ్ఆర్సీకి వర్ల ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-06-28T14:36:20+05:30 IST
ఎన్హెచ్ఆర్సీకి టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. కొందరు పోలీసులు వైసీపీ నేతలతో కుమ్మక్కయ్యారని లేఖలో వెల్లడించారు.
అమరావతి: ఎన్హెచ్ఆర్సీకి టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. కొందరు పోలీసులు వైసీపీ నేతలతో కుమ్మక్కయ్యారని లేఖలో వెల్లడించారు. ఏపీని మానవ హక్కుల ఉల్లంఘనల కేంద్రంగా మార్చారని వర్ల రామయ్య పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే పోలీసుల సాయంతో అణచివేస్తున్నారన్నారు. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నారాయణను పోలీసులు చిత్రహింసలు పెట్టారన్నారు. ఎలక్ట్రిక్ వస్తువులు చోరీ చేశారని నెపం వేసి తీవ్రంగా కొట్టారని వర్ల రామయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. అవమానం తాళలేక ఉదయగిరి నారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై విచారణ జరిపి నారాయణ కుటుంబానికి న్యాయం చేయాలని.. ఎన్హెచ్ఆర్సీని వర్ల రామయ్య లేఖలో కోరారు.
నారాయణ కుటుంబానికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.