అలా చేసివుంటే కోకాపేటను మించిన ధర వచ్చేయి: వర్ల
ABN , First Publish Date - 2021-07-27T00:55:12+05:30 IST
అలా చేసివుంటే కోకాపేటను మించిన ధర వచ్చేయి: వర్ల
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛాపూరితం కాదని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. అమరావతిపై తప్పుడు ప్రచారం చేసి దళితులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి పనులు కొనసాగించి ఉంటే కోకాపేటను మించిన ధర వచ్చేదన్నారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు లేఖతో రాయలసీమకు తీరని నష్టమన్నారు. కేసులకు భయపడి కృష్ణా, గోదావరి జలాలపై ఏపీ హక్కుల్ని కేంద్రానికి తాకట్టు పెట్టారని వ్యాఖ్యానించారు.