మావోలతో కలిసేందుకు అనుమతివ్వండి: శిరోముండనం బాధితుడు
ABN , First Publish Date - 2020-08-11T03:53:06+05:30 IST
తనను తీవ్ర అవమానానికి గురి చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు తనను మావోయిస్టులతో కలిసేందుకు అనుమతివ్వాలంటూ సీతానగరం శిరోముండనం బాధితుడు వరప్రసాద్
రాజమండ్రి: తనను తీవ్ర అవమానానికి గురి చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు తనను మావోయిస్టులతో కలిసేందుకు అనుమతివ్వాలంటూ సీతానగరం శిరోముండనం బాధితుడు వరప్రసాద్ భారత రాష్ట్రపతిని కోరాడు. ఈ మేరకు శుక్రవారం అతను రాష్ట్రపతికి ఒక లేఖ రాశాడు. జులై 18వ తేదీన పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి తనను చిత్రహింసలకు గురిచేసి శిరోముండనం చేశారని, ఈ ఘటనలో ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదని బాధితుడు వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. స్థానిక వైసీపీ నేతలు తనను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపించాడు. ఇక తనకు న్యాయం జరగదని భావిస్తున్నానని, మావోయిస్టులతో కలిసి ప్రతీకారం తీర్చుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాడు.