మోదీ కోసం చేనేత కార్మికుడి వస్త్రం

ABN , First Publish Date - 2020-08-02T21:09:43+05:30 IST

Varanasi weaver prepares cloth for modi..

మోదీ కోసం చేనేత కార్మికుడి వస్త్రం

వారణాసి: అయోధ్యలో ఈనెల 5న రామాలయ నిర్మాణ భూమి పూజ కోసం వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కోసం వారణాసిలోని ఓ నేత కార్మికుడు ప్రత్యేక వస్త్రాన్ని రూపొందించారు. 'జై శ్రీ రామ్, అయోధ్య పవిత్ర థామ్' అని ఆ వస్త్రంపై ఎంబ్రాయిడరీ చేశారు. ఈ వస్త్రం ప్రత్యేకతను నేత కార్మికుడు బచ్చేలాల్ ఆదివారంనాడు మీడియాకు వివరించారు.


మెటిరీయల్, డిజైన్ ఈ వస్త్రం గొప్పతనమని, దీనిపై జైశ్రీమ్, అయోధ్య పవిత్ర థామ్ అని రాసి ఉంటుందని చెప్పారు. రాముడి ధనుస్సు కూడా ఇందులో డిజైన్ చేసినట్టు చెప్పారు. కాటన్, సిల్క్ దారాలతో ఈ క్లాత్ తయారు చేశామని, వస్త్రం తయారికీ 15 రోజులు పట్టిందని తెలిపారు. ఇందులో బంగారు, ఎరుపు రంగు వాడినట్టు చెప్పారు.  పొడవు 72 అంగుళాలు, వెడల్పు 22 అంగుళాలతో ఈ క్లాత్ తయారైంది. పోలీస్ కమిషనర్ ద్వారా అయోధ్యకు ఈ వస్త్రం పంపాలని అనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుండటం చాలా సంతోషంగా ఉందని, ఇందువల్ల పర్యాటకంతో పాటు తమ వ్యాపారం కూడా పెరుగుతుందని బచ్చే లాల్ సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-08-02T21:09:43+05:30 IST