సామూహిక వరలక్ష్మి వ్రతాలు
ABN , First Publish Date - 2022-08-20T05:32:38+05:30 IST
జిల్లాలోని పలు ఆలయాలు, ఇళ్లలో మహిళలు శ్రావణ శుక్రవారం పూజలు నిర్వహించారు.
పాలకొల్లు అర్బన్ / భీమవరం టౌన్, ఆగస్టు 19: జిల్లాలోని పలు ఆలయాలు, ఇళ్లలో మహిళలు శ్రావణ శుక్రవారం పూజలు నిర్వహించారు. పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయంలో మ హిళలు సామూహికంగా వరలక్ష్మిదేవికి పూజలు చేశారు. యడ్లబజారులో ని కనకదుర్గ ఆలయంలో సుమారు 5 వేలమంది భక్తులు అమ్మవారిని ద ర్శించుకున్నారు. భీమవరం మెంటేవారి తోటలో బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ధనలక్ష్మిదేవిగా అలంకరించారు. భక్తులు దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. ఆకివీడు పెద్దింట్లమ్మ, వనువులమ్మ, గంగానమ్మ, మద్దిరావమ్మ, కనకదుర్గ, మారెమ్మ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పిల్ల లమర్రి అగ్రహారంలోని పార్వతీ సమేత వెంకట రామలింగేశ్వరస్వామి ఆల యంలో మహిళలు సామూహిక కుంకుమ పూజలు చేశారు. కొల్లేటికోట పె ద్దింటి అమ్మవారి ఆలయంలో అభిషేకం, అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడు వై.జంక్షన్ వద్ద దుర్గమ్మ ఆలయంలో సామూహిక శ్రావణ వరలక్ష్మి వ్రతాలు చేశారు.