అప్పన్నకు కరాళ చందన సమర్పణ
ABN , First Publish Date - 2020-08-04T10:13:56+05:30 IST
వరాహ లక్ష్మీనృసింహస్వామికి సంప్రదాయబద్ధంగా కరాళ చందన సమర్పణ గావించారు.
సింహాచలం, ఆగస్టు 3: వరాహ లక్ష్మీనృసింహస్వామికి సంప్రదాయబద్ధంగా కరాళ చందన సమర్పణ గావించారు. ఏటా మాదిరిగానే సోమవారం వేకువజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ 13 రకాల సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన కరాళ చందనాన్ని అప్పన్న స్వామికి పై పూతగా వేసి ప్రత్యేక పూజలు చేశారు.