డీఎస్పీ నిజాయితీగా పనిచేయట్లేదు: వరదరాజులరెడ్డి

ABN , First Publish Date - 2021-08-31T21:41:52+05:30 IST

ప్రొద్దుటూరు డీఎస్పీ నిజాయితీగా పని చేయట్లేదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు.

డీఎస్పీ నిజాయితీగా పనిచేయట్లేదు: వరదరాజులరెడ్డి

క‌డ‌ప: ప్రొద్దుటూరు డీఎస్పీ నిజాయితీగా పనిచేయట్లేదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. మంగళవారం 9 ఏళ్ల బాలుడి హత్యకేసు మిస్టరీ, పోలీసుల తీరుపై వరదరాజులరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజుపాలెం మండలం వెంగ‌ళాయ‌ప‌ల్లెలో బాలుడి హ‌త్య కేసులో పోలీసుల విచార‌ణ స‌రిగా లేదన్నారు. పోలీసులు రాజ‌కీయ వ‌త్తిళ్ల‌కు, డ‌బ్బుకు త‌లొగ్గి కేసుకు స‌బంధం లేని ద‌స్త‌గిరిని అరెస్టు చేశారని వరదరాజులరెడ్డి మండిపడ్డారు.

ప్రొద్దుటూరులో పోలీసుల అవినీతి కార్య‌క‌లాపాలు ఎక్కువ‌య్యాయని ఆరోపించారు. అధికార పార్టీ నేత‌లు ఎలా చెబితే అలా పోలీసులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసు అధికారుల అవినీతిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు. పోలీసులు ప్రొద్దుటూరులో దుర్మార్గంగా వ్య‌హ‌రిస్తున్నారని దుయ్యబట్టారు. వెంగ‌ళాయ‌ప‌ల్లె బాలుడు త‌నీష్ రెడ్డి హ‌త్య కేసులో అస‌లైన దోషులను ప‌ట్టుకోవాలని వరదరాజులరెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-08-31T21:41:52+05:30 IST