ఏఈవోల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సురేష్
ABN , First Publish Date - 2022-01-25T05:33:36+05:30 IST
కల్చర్ ఎక్స్టెన్షన ఆఫీస ర్( ఏఈవో) సంఘం జిల్లా అధ్యక్షుడిగా జీ సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గుంటూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): కల్చర్ ఎక్స్టెన్షన ఆఫీస ర్( ఏఈవో) సంఘం జిల్లా అధ్యక్షుడిగా జీ సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు మండల కార్యాలయం కృషిభవనలో సోమవారం రాష్ట్ర అధ్యక్షుడు వేణుమాధవరావు, సత్యన్నారాయణరెడ్డి, సుభాన, సత్యన్నారాయణల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎనుకొన్నారు. అధ్యక్షుడిగా సురేష్, కా ర్యదర్శిగా సుదర్శనరావు, కోశాధికారిగా బ్రహ్మయ్య, ఉపాధ్యక్షులుగా వెంకయ్య, హరిప్రసాద్, ఏ రమేష్ బాబు, ఎలీషా, శివాజి, జ్యోత్స్నా, కార్యనిర్వాహక కార్యదర్శిగా కృష్ణారావు, ప్రచార కార్యదర్శిగా శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా ఆరిఫ్, రాజేంద్రప్రసాద్, ప్రభాకర్, శేషుబాబు, నాగశ్రీనివాసరావులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రనాయకులు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలలో ఏఈవోలను తొలగించాలన్నారు. ఆర్బీకేలలో గ్రామవ్యవసాయ సహాయకుల స్థానంలో విస్తరణ అధికారులను నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నూతన కార్యవర్గం రాష్ట్రనాయకుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించింది.