వంశధారకు వరద!
ABN , First Publish Date - 2020-08-11T10:02:05+05:30 IST
వంశధార నదికి వరద నీరు పోటెత్తింది. ఒడిశాతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు చేరుతోంది.
హిరమండలం, ఆగస్టు 10: వంశధార నదికి వరద నీరు పోటెత్తింది. ఒడిశాతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు చేరుతోంది. మహేంద్రతనయ నది నుంచి వరద నీరు చేరుతుండడంతో గొట్టా బ్యారేజీకి ఇన్ఫ్లో పెరిగింది. దీంతో బ్యారేజీ 17 గేట్లు ఎత్తి కిందకు నీరు విడిచిపెడుతున్నారు. ఎడమ కాలువ ద్వారా 1769 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాలువ ద్వారా 466 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్టు డీఈ ప్రభాకరరావు తెలిపారు. 17 గేట్ల ద్వారా కిందకు 12,274 క్యూసెక్కుల నీరు వెళ్తున్నట్టు చెప్పారు.