‘వాన్పిక్’ భూములు ఉచితంగా పొందలేదు
ABN , First Publish Date - 2021-11-26T10:00:48+05:30 IST
అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఒప్పందం జరిగిన వాన్పిక్ ప్రాజెక్టులో భాగంగా సేకరించిన భూములకు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ మొత్తంలో రైతులకు చెల్లించామని నిమ్మగడ్డ ప్రసాద్ తెలంగాణ హైకోర్టుకు వెల్లడించారు.
జగన్ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ వెల్లడి
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఒప్పందం జరిగిన వాన్పిక్ ప్రాజెక్టులో భాగంగా సేకరించిన భూములకు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ మొత్తంలో రైతులకు చెల్లించామని నిమ్మగడ్డ ప్రసాద్ తెలంగాణ హైకోర్టుకు వెల్లడించారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో వాన్పిక్ ప్రాజెక్టు, నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం గురువారం విచారణ కొ నసాగించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.