రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా వాణీమోహన్
ABN , First Publish Date - 2020-05-31T08:47:25+05:30 IST
రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెక్రటరీగా ప్రభుత్వం ఐఏఎస్ అధికారిణి వాణీ మోహన్ను నియమించింది. శనివారం అర్ధరాత్రి సమయంలో ఈ జీవో వెలువడింది. ప్రస్తుతం ఆమె కోఆపరేటివ్ డెయిరీ డెవల్పమెంట్ కమిషనర్గా ఉన్నారు.
అమరావతి, మే 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెక్రటరీగా ప్రభుత్వం ఐఏఎస్ అధికారిణి వాణీ మోహన్ను నియమించింది. శనివారం అర్ధరాత్రి సమయంలో ఈ జీవో వెలువడింది. ప్రస్తుతం ఆమె కోఆపరేటివ్ డెయిరీ డెవల్పమెంట్ కమిషనర్గా ఉన్నారు. ఇకపై ఆమె ఈ బాధ్యతల్లో ‘ఇన్చార్జి’గా కొనసాగుతారు. గతంలో ఎస్ఈసీ సెక్రటరీగా ఉన్న రామసుందర రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. జీవీఎస్ ప్రసాద్ తాత్కాలికంగా ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘నేను మళ్లీ బాధ్యతలను స్వీకరిస్తున్నాను’ అంటూ నిమ్మగడ్డ రమేశ్ పంపిన సర్క్యులర్ను ఆయనే అటెస్ట్ చేసి అందరికీ పంపించారు. ఎస్ఈసీపై వివాదం చెలరేగుతున్న సమయంలోనే... కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ వాణీమోహన్ను నియమించడం విశేషం.