ప్రజా సేవకు పార్టీ అవసరం లేదు: వాణీ విశ్వనాథ్‌

ABN , First Publish Date - 2022-06-13T03:01:19+05:30 IST

ప్రజా సేవ చేయడానికి ఏ పార్టీ అవసరం లేదని సినీ నటి వాణీవిశ్వనాథ్‌ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నగరి ఆంధ్రవాడలో ఆదివారం జరిగిన మాతమ్మ

ప్రజా సేవకు పార్టీ అవసరం లేదు: వాణీ విశ్వనాథ్‌

నగరి: ప్రజా సేవ చేయడానికి ఏ పార్టీ అవసరం లేదని సినీ నటి వాణీవిశ్వనాథ్‌ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నగరి ఆంధ్రవాడలో ఆదివారం జరిగిన మాతమ్మ తిరుణాళ్ళలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాతమ్మ ఆలయానికి రూ.60 వేలు విరాళంగా ఇచ్చారు. తన సేవను గుర్తించి ఏ పార్టీ  తనకు సముచిత స్థానం కల్పిస్తుందో ఆ పార్టీ తరపున రాబోయే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. వీలుకాని పక్షంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని వాణీ విశ్వనాథ్‌ తెలిపారు.

Updated Date - 2022-06-13T03:01:19+05:30 IST