రాష్ట్రంలో దుర్మార్గపు పాలన: వంగలపూడి అనిత

ABN , First Publish Date - 2022-03-13T02:35:44+05:30 IST

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత విమర్శించారు. శనివారం ఆమె మీడియాతో

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన: వంగలపూడి అనిత

అమరావతి: రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత విమర్శించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. సొంత బాబాయ్‌ హత్యకు గురైతే, కుట్లు వేయించి, గుండెపోటుగా ప్రచారం చేశారని ఆరోపించారు. తీరా హత్య అని బయటకు రావడంతో ‘నారా వారి రక్త చరిత్ర’ అంటూ విషపు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇప్పుడేమో వివాహేతర సంబంధమే హత్యకు కారణమంటూ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు అధికార పార్టీ నేతలు తెరలేపారని అనిత ఆరోపించారు. ప్రతిపక్షనేతగానే కాకుండా సీఎంగా ఇచ్చిన మాటను తప్పిన ఘనత జగన్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకూ అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన పథకాలకు నిధులు మంజూరుకాలేదని వంగలపూడి అనిత దుయ్యబట్టారు.

Updated Date - 2022-03-13T02:35:44+05:30 IST