AP NEWS: రక్షకభట నిలయాలు కాదు.. ప్రజా భక్షకభట నిలయాలు: వంగలపూడి అనిత

ABN , First Publish Date - 2022-09-25T21:37:18+05:30 IST

వైసీపీ పాలన(ycp govt)లో రక్షకభట నిలయాలు.. ప్రజా భక్షకభట నిలయాలుగా మారాయని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత( Vangalapudi Anita) అన్నారు.

AP NEWS: రక్షకభట నిలయాలు కాదు.. ప్రజా భక్షకభట నిలయాలు: వంగలపూడి అనిత

అమరావతి( Amaravati): వైసీపీ పాలన(ycp govt)లో రక్షకభట నిలయాలు.. ప్రజా భక్షకభట నిలయాలుగా మారాయని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత( Vangalapudi Anita) అన్నారు. ఆదివారం అనిత మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌రెడ్డి(cm jagan reddy) పాలనలో పోలీసులు న్యాయానికి సంకెళ్లు వేసి అన్యాయాన్ని విచ్చలవిడిగా వీధుల్లోకి వదిలారని మండిపడ్డారు.న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కి వెళ్లిన బాధితులు అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. ఏలూరు పెదవేగి మండలం వేగివాడలో బాలికపై  అత్యాచారం చేసిన నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోక పోవడం వల్లే బాధిత బాలిక, తల్లి ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాపం పాలకులదే, జగన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ లేదని ధ్వజమెత్తారు. జగన్‌రెడ్డి పాలనలో న్యాయం జరగక బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. తల్లీకూతుళ్ల మృతికి కారణమైన పెదవేగి ఎస్‍ఐపై పోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి రాష్ట్రoలో ప్రతి రోజూ మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని దుయ్యబట్టారు.మహిళా హోం మంత్రి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ ఏం చేస్తున్నారు? అని వంగలపూడి అనిత ప్రశ్నించారు. 

Updated Date - 2022-09-25T21:37:18+05:30 IST