Jagan ఓ సైకో.. ఇది సిగ్గులేని ప్రభుత్వం: Anita
ABN , First Publish Date - 2022-06-20T20:19:53+05:30 IST
టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Visakha: టీడీపీ (TDP) మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anita) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ (CM Jagan) ఓ సైకో అని, ఇది సిగ్గులేని ప్రభుత్వమని విమర్శించారు. చలో నర్సీపట్నం కోసం టీడీపీ పిలుపిస్తే.. తమ పార్టీ నేతలను హౌస్ అరెస్టు (House Arrest) చేశారని మండిపడ్డారు. నేమ్ బోర్డు లేని పోలీసులు ఇంటిలోకి ఎంటర్ అయితే.. ప్రైవేట్ కేసులు పెడతామని హెచ్చరించారు.
రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని.. జగన్ రెడ్డి పతనం మొదలైందని వంగలపూడి అనిత అన్నారు. కూల్చి వేతలపై హైకోర్టు అమ్మనాబూతులు తిట్టిందని, అయినా బుద్ధిరాలేదన్నారు. ఇగో సంతృప్తి పరచుకోవడం కోసం కూల్చివేతలు చేస్తున్నారని, ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం ఎక్కడైనా వుందా? అని ప్రశ్నించారు. నేమ్ ప్లేట్ లేకుండా.. 41 నోటీస్ లేకుండా.. యూనిఫామ్లో వచ్చినవారు గృహనిర్భందం ఎలా చేస్తారని నిలదీశారు. టీడీపీకి 70 లక్షల మంది కార్యకర్తలు వున్నారని.. ఎంత మందిని ఆపగలరని అన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమని, ప్రతి ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకుంటామని హెచ్చరించారు. 175 స్ధానాలు వైసీపీ గెలవడం అత్యాశని.. వ్యతిరేక ఓటు పడటం ఖాయమని అనిత వ్యాఖ్యానించారు.