ఎర్ర కూలీలను తరలిస్తున్న వ్యాన్‌ బోల్తా

ABN , First Publish Date - 2022-01-28T05:28:45+05:30 IST

శేషాచలం అడవుల్లోకి ఎర్రచందనం కూలీలను తరలిస్తున్న మినీ వ్యాన్‌ గురువారం సాయంత్రం పలమనేరు - వి.కోట మార్గంలో కుమ్మరమడుగు వద్ద బోల్తాపడింది.

ఎర్ర కూలీలను తరలిస్తున్న వ్యాన్‌ బోల్తా
బోల్తా పడిన వాహనం

పరారైన దొంగలు.. బ్యాగుల్లో గొడళ్ళు, కత్తులు


వి.కోట, జనవరి 27: శేషాచలం అడవుల్లోకి ఎర్రచందనం కూలీలను తరలిస్తున్న మినీ వ్యాన్‌ గురువారం సాయంత్రం  పలమనేరు - వి.కోట మార్గంలో కుమ్మరమడుగు వద్ద బోల్తాపడింది. వాహనంలో వెనుక ఉన్న వారు చాకచక్యంగా పరారయ్యారు. వాహనాన్ని పరిశీలించగా వెనుక వైపు టార్పాల్‌ కట్టబడి అందులో సంచులు కనిపించాయి. డ్రైవర్‌ సహా అందరూ పరారవ్వడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బ్యాగులు పరిశీలించగా అందులో గొడళ్ళు, కత్తులు, రంపాలు, బియ్యం, ఇతర వంట సామగ్రి లభించాయి. ఇది కచ్చితంగా ఎర్రకూలీలను తరస్తున్న వాహనంగా పోలీసులు నిర్థారించారు. ఈ మేరకు వాహన నంబరు, ఇతర ఆధారాల ద్వారా దొంగలను గుర్తించే పనిలో ఉన్నట్లు సీఐ ప్రసాద్‌బాబు తెలిపారు. వి.కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2022-01-28T05:28:45+05:30 IST