తృటిలో తప్పిన ప్రమాదం
ABN , First Publish Date - 2021-04-17T05:21:35+05:30 IST
తృటిలో ప్రమాదం తప్పింది. ఏ మాత్రం వ్యాన్ అదుపుతప్పి ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టినా పెద్ద ప్రమాదమే జరిగేది.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి వ్యాను బోల్తా
పాలకోడేరు, ఏప్రిల్ 16 : తృటిలో ప్రమాదం తప్పింది. ఏ మాత్రం వ్యాన్ అదుపుతప్పి ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టినా పెద్ద ప్రమాదమే జరిగేది. భీమవరం వైపు నుంచి గరగపర్రు మీదుగా వెళ్లే కోళ్ళ వ్యాను గురువారం అర్ధ రాత్రి దాటాక అతివేగంగా వచ్చి విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఉన్న రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వైర్లు తెగిపడి విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. కోళ్ళ వ్యానులో ఉన్న కోళ్లు కొన్ని దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు. ప్రమాదం కారణంగా రెండు విద్యుత్ స్తం భాలు విరిగిపడడంతో పాటు ఒక ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా పాడైందని గొల్లలకోడేరు లైన్మన్ రామకృష్ణ తెలిపారు