వామ్మో.. గిదేం రోడ్డు!
ABN , First Publish Date - 2022-06-19T05:20:46+05:30 IST
వామ్మో.. గిదేం రోడ్డు!
బషీరాబాద్,జూన్ 18: తాండూరు-లక్ష్మీనారాయణపూర్ ఆర్అండ్బీ ప్రధాన మార్గం గుంతలమయంగా మారింది. వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ రోడ్డులో వెళ్లే వాహనాలు నడిపితే ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. భయంభయంగా రాకపోకలు సాగిస్తున్నారు. శనివారం ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ రోడ్డుపై పడిన గుంతలోంచి దాటుతుండగా ధాన్యం బస్తాలు రోడ్డుపై పడిపోయాయి. ఆ సమయంలో ద్విచక్ర వాహనదారులు పక్కనుంచి వెళ్తున్న క్రమంలో బస్తాలు ఇలా పడిఉంటే పరిస్థితేమిటంటూ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మార్గంలో వెళ్తున్న వారు వామ్మో ఇవేం.. రోడ్డు కష్టాలంటూ ముందుకుసాగారు.