30న కలెక్టరేట్ వద్ద ధర్నా
ABN , First Publish Date - 2022-05-23T06:24:07+05:30 IST
భానుగుడి (కాకినాడ), మే 22: అధిక ధరలు, పన్నుల భారాలకు వ్యతిరేకంగా మే 30న కాకినాడ కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. సుందరయ్యభవన్లోని వామపక్ష పార్టీల సమావేశం జి.ఆదినారాయణ అధ్యక్షతన ఆదివారం నిర్వహించ
భానుగుడి (కాకినాడ), మే 22: అధిక ధరలు, పన్నుల భారాలకు వ్యతిరేకంగా మే 30న కాకినాడ కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. సుందరయ్యభవన్లోని వామపక్ష పార్టీల సమావేశం జి.ఆదినారాయణ అధ్యక్షతన ఆదివారం నిర్వహించగా సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.మధు, సీపీఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎం.దుర్గాప్రసాద్, న్యూడెమోక్రసీ నేత జి.ఆదినారాయణ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లోవరత్న ధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు.