వాల్మీకి మహర్షి ఆదర్శప్రాయుడు: మంత్రి జయరాం

ABN , First Publish Date - 2021-10-21T06:13:06+05:30 IST

మానవజాతికి వాల్మీకి మహర్షి ఆదర్శప్రాయుడని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు.

వాల్మీకి మహర్షి ఆదర్శప్రాయుడు: మంత్రి జయరాం

అనంతపురంరూరల్‌, అక్టోబరు 20: మానవజాతికి వాల్మీకి మహర్షి ఆదర్శప్రాయుడని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. బుధవా రం ఆంధ్రప్రదేశ వెనుకబడిన తరుగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగర శివారులోని శిల్పారామంలో వాల్మీకి జయంతి ఉ త్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి జయరాం, ప్రభుత్వ వి ప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీలు రం గయ్య, గోరంట్ల మాధవ్‌, రెడ్డెప్ప, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ, ఏపీ వాల్మీకి బోయ కా ర్పొరేషన చైర్మన మధుసూదన, కో-ఆపరేటివ్‌ ఫైనాన్స కార్పొరేషన లిమిటెడ్‌ ఎం డీ నాగభూషణం, రాష్ట్ర నాటక అకాడమీ చై ర్మన హరిత, జేసీ నిశాంతకుమార్‌, ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన లిఖిత తదితరు లు హాజరయ్యారు. ముందుగా నగరంలోని పవరాఫీస్‌ సమీపానగల వాల్మీకి మహర్షి విగ్రహానికి పూ లమాలలు వేసి, నివాళులర్పించారు. అ నంతరం శిల్పారామంలో నిర్వహించిన కా ర్యక్రమంలో మంత్రి జయరాం మాట్లాడు తూ.. రాష్ట్రంలో వాల్మీకులకు ముఖ్యమం త్రి జగనమోహనరెడ్డి పెద్దపీట వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డీడీ యుగంధర్‌, బీసీ కార్పొరేషన ఈడీ నాగముని పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T06:13:06+05:30 IST