వాల్మీకి జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2021-10-21T04:57:04+05:30 IST

కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు.

వాల్మీకి జయంతి వేడుకలు
వాల్మీకి జయంతి వేడుకల్లో కలెక్టర్‌

కర్నూలు(కలెక్టరేట్‌), అక్టోబరు 20: కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, కర్నూలు నగర మేయర్‌ బీవై రామయ్య, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, జేసీ శ్రీనివాసులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సుభాష్‌ చంద్రబోస్‌, డిప్యూటీ మేయర్‌ సిద్దారెడ్డి రేణుక వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేశారు. గౌరి గోపాల్‌ జంక్షన్‌ వద్ద వాల్మీకి విగ్రహానికి కర్నూలు ఎంపీ డా.సంజీవకుమార్‌, కర్నూలు నగర మేయర్‌ బీవై రామయ్య, జాయింట్‌ కలెక్టర్‌ ఎంకేవీ శ్రీనివాసులు, వీరశైవ లింగాయత్‌ డైరెక్టర్‌ గోపాల్‌ రెడ్డి, ఎల్లమ్మ గుడి చైర్మన్‌ కృష్ణ, బీసీ కార్పొరేషన్‌ ఈడీ నాగశివలీల, జిల్లా బీసీ సంక్షేమ అధికారి వెంకటలక్ష్మి, ప్రజాప్రతినిధులు, వాల్మీకి బీసీ సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎస్‌.శ్రీనివాస కుమార్‌, సెట్కూరు సీఈవో నాగరాజనాయుడు, వీఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు గిడ్డయ్య, వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకులు కుబేరస్వామి, బాల సంజన, కృష్ణమ నాయుడు, జె.శ్రీనివాసనాయుడు, నాగమణి, వినోధ్‌, మమేశ్వరి, వాల్మీకి, బీసీ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T04:57:04+05:30 IST