వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ
ABN , First Publish Date - 2022-10-07T05:14:00+05:30 IST
మండలంలోని కోనాపురంలో నూతనంగా నిర్మించిన వాల్మీకి మహర్షి విగ్రహప్రతిష్ఠను గురువారం వైభవంగా నిర్వహించారు. మహిళలు జ్యోతులతో ఊరేగింపు చేపట్టారు.
పరిగి, అక్టోబరు 6: మండలంలోని కోనాపురంలో నూతనంగా నిర్మించిన వాల్మీకి మహర్షి విగ్రహప్రతిష్ఠను గురువారం వైభవంగా నిర్వహించారు. మహిళలు జ్యోతులతో ఊరేగింపు చేపట్టారు. ఈసం దర్భంగా అన్నదానం చేశారు. కార్యక్రమంలో వాల్మీకి సేవాద ళ్ అధ్యక్షులు అంబికా లక్ష్మీనారాయణ, ఆదినారాయణ, వినయ్కుమార్, ఆ నంద్, ఊటకూరు మాజీ సర్పంచ ఈశ్వరప్ప, జిల్లా లీగల్సెల్ అధ్యక్షులు శివశంకర్, శ్రీనివాసులు, వెంకటరమణ, రాము పాల్గొన్నారు.
9న వాల్మీకి జయంతి
హిందూపురం అర్బన: పట్టణంలో వాల్మీకి జయంతి వేడుకలకు ఈనెల 9న నిర్వహిస్తున్నట్లు వాల్మీకి సంఘం నాయకులు ప్రకటన లో పేర్కొన్నారు. మహిళలు జ్యోతులతో పొట్టి శ్రీరాములు సర్కిల్ నుంచి వాల్మీకి సర్కిల్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఉ ద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, వ్యాపార, యువజన, ఉపసంఘాల నాయకులు, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.