దుట్టా, యార్లగడ్డ వర్గీయులపై Vallabhaneni Vamsi ఘాటు విమర్శలు

ABN , First Publish Date - 2022-05-20T21:35:19+05:30 IST

దుట్టా, యార్లగడ్డ వర్గీయులపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ఘాటు విమర్శలు చేశారు.

దుట్టా, యార్లగడ్డ వర్గీయులపై Vallabhaneni Vamsi ఘాటు విమర్శలు

అమరావతి: దుట్టా, యార్లగడ్డ వర్గీయులపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ఘాటు విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన చేతిలో సింగిల్‌గా గ్రూపులు గ్రూపులుగా ఓడిపోయారని జోస్యం చెప్పారు. ఈగో వల్ల ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. గత 3 ఎన్నికల్లో వాళ్లని ఒక్క అడుగు కూడా వేయనివ్వలేదని, అందుకే తాను నచ్చలేదన్నారు. నియోజకవర్గంలో ఎవరూ తనపై ఆధిపత్యం సాధించలేకపోయారని తెలిపారు. తనకు ఎవరితో సమస్య లేదని, వారికి ఎవరితో ఉందో తెలియదన్నారు. నియోజకవర్గ సమస్యలపైనే సీఎం పేషీకి వెళ్లానని వంశీ తెలిపారు. దుట్టా రామచంద్రరావును తనను కూర్చొబెట్టి మాట్లాడింది లేదన్నారు. నియోజకవర్గ నాయకులకి మాతో సమస్యా?..పార్టీతో సమస్యా? అని ప్రశ్నించారు. అధిష్ఠానంతో సమస్యా అనేది అర్థం కావడం లేదని చెప్పారు. వైసీపీ క్యాడర్‌ను ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదని తెలిపారు. జగనన్న కాలనీల కోసమే గ్రామస్తులు మట్టితవ్వుకుంటున్నారని తెలిపారు. యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు అందరం కలిసే పనిచేసుకుంటున్నామని వంశీ తెలిపారు.

Updated Date - 2022-05-20T21:35:19+05:30 IST